Thursday, September 27, 2012

Sri Kanchi Maha Periva Sayings


రామాయణం లో మధుర శ్లోకాలు

      *కార్యసిద్ధికి సుందరాకాండ 39 వ సర్గలోని 4 వశ్లోకం*
       
      *త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
      హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ*
      శ్లోకార్థం:

      "ఓ వానరశ్రేష్ఠుడా, ఈ పని (రావణసంహారం/సీతా-రాములు మళ్ళీ కలవటం)
      నెరవేరకుండుటను ప్రత్యక్షంగా చూస్తున్న/చూసిన సాక్షివి నీవు. నీ ప్రయత్నం ప్రారంభించు; దుఃఖనివారకుడవగుము"
      ఇది హనుమ సీతాఅమ్మవారిని లంకలో దర్శించి మళ్ళీ రామునికి వార్త అందివ్వటానికి బయలుదేరే సమయంలో సీతా అమ్మవారు హనుమతో అన్న మాటలు.

      ఈ శ్లోకం మంత్రసమానము (సుందరకాండ అంతా మంత్రమే; అలా దర్శించలేని వారికి ఇలా కొన్ని ప్రత్యేకశ్లోకాలు మంత్రాలుగా చెప్తారు పెద్దలు.)

      దీనిని అమ్మవారి వచనంగా తీసుకుంటే హనుమంతుడికి అనుఙ్ఞాపూర్వక ఆశీస్సు ధ్వనిస్తుంది. మనకున్న సత్సంకల్పాలను భగవంతుని పాదార్పణం చేసి మనం పఠించి హనుమను ప్రార్థస్తే, అభ్య్యర్థనాపూర్వక ప్రార్థన ధ్వనిస్తుంది.
       

Monday, September 24, 2012

గోమాత


వరుణశ్చైవ గోమూత్రే, గోమయే హవ్య వాహనః
దధేవాయుః సముద్దిష్టః సోమః క్షీరేఘ్రుతేరవిః

గో మూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయు దేవుడు, ఆవు పాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో, 
యోనివద్ద ఇష్టార్ధ దేవతలు కోలువైయున్నారు.

పూర్వ కాలంలో గోవులేన్ని ఎక్కువ ఉంటె వారే శ్రీమంతులుగా వుండేవారు. గో ధనమే నిజ ధనంగా భావించేవారు.గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావన యుండేది. 

అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ (విరాటపర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు.

గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే, మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి.
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చెస్తే సర్వ పాపాలు హరిస్తాయి.

Thursday, September 20, 2012

సప్తగిరులు



శ్రీశైలం, శేషశైలం, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి -- అనేవి. పేర్లు ఏదైనా - ఒకే పర్వత సముదాయం
 -- ఇది. యుగాభేదాలతో, వ్యక్తుల పేర్లతో, భక్తుల పేర్లతో, ఈ పర్వతశ్రే ణికి ఏడు పేర్లు ఏర్పడ్డాయి. ఇవేకాక
-- చింతామణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి, -- ఇలా
 ఎన్నో సార్థకమైన పేర్లున్నాయి. బ్రహ్మాండపురాణం ఈ పర్వతాలకు 20 పేర్లు పేర్కొనింది.

(1) శ్రీశైలం - శ్రీదేవికి నివాసమై -- భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కనుక.
(2) శేషశైలం - ఆదిశేషుడే పర్వతంగా రూపొందిన పర్వతం.
(3) గరుడాద్రి - వరాహస్వామి ఆజ్ఞపై గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున - గరుడాద్రి.
(4) వేంకటాద్రి - వేం = పాపాలను, కటః = దహింప చేసేది. పాప నాశకమైనది.
వేం = అమ్రుతత్వాన్నీ, కటః = ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కనుక - వెంకటాచలం.
(5) నారాయణాద్రి = మునుపు 'నారాయణ' అనే బ్రాహ్మణుడు తపస్సు చేసి, విష్ణుదేవున్ని ప్రత్యక్షం చేసుకొని, '
ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ది పొందాలని అర్థించాడు. స్వామి అనుగ్రహించాడు. -- అందువల్ల నారాయణాద్రి.
 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నివసించి ఉండే స్థానం కనుకనూ నారాయణాద్రి.
(6) వృషభాద్రి - వృషభుడనే శివభక్తుడు శబర వేషంతో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసాడు. స్వామి సుధార్శనాయుధంతో అతన్ని సంహరించాడు. మరణిస్తూ అతడు 'ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధికి రావాలని' కోరాడు కనుక వృషభాద్రి. మరొకటి వృషభుడనే రాక్షసుడు స్వామివారితో యుద్దంచేసి, చక్రాయుధంతో హతుడై మరణిస్తూ 'ఈ పర్వతం తన పేరుతో ఉందా' లని కోరాడు. కనుక వృషభాద్రి.
(7) వృషాద్రి - వృష మంటే ధర్మం. ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున -- వృషాద్రి.

సుప్రభాతంలో "శ్రీశేషశైల ..... తవ సుప్రభాతం" శ్లోకం ఈ సప్తగిరులను ప్రస్తుతించింది.
20 నామాలను స్మరించే శ్లోకాలు -- బ్రహ్మాండ పురాణం - శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం - 1 అధ్యాయం 21 నుంచి 23 శ్లోకాలు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.