Thursday, September 27, 2012

రామాయణం లో మధుర శ్లోకాలు

      *కార్యసిద్ధికి సుందరాకాండ 39 వ సర్గలోని 4 వశ్లోకం*
       
      *త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
      హనుమన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ*
      శ్లోకార్థం:

      "ఓ వానరశ్రేష్ఠుడా, ఈ పని (రావణసంహారం/సీతా-రాములు మళ్ళీ కలవటం)
      నెరవేరకుండుటను ప్రత్యక్షంగా చూస్తున్న/చూసిన సాక్షివి నీవు. నీ ప్రయత్నం ప్రారంభించు; దుఃఖనివారకుడవగుము"
      ఇది హనుమ సీతాఅమ్మవారిని లంకలో దర్శించి మళ్ళీ రామునికి వార్త అందివ్వటానికి బయలుదేరే సమయంలో సీతా అమ్మవారు హనుమతో అన్న మాటలు.

      ఈ శ్లోకం మంత్రసమానము (సుందరకాండ అంతా మంత్రమే; అలా దర్శించలేని వారికి ఇలా కొన్ని ప్రత్యేకశ్లోకాలు మంత్రాలుగా చెప్తారు పెద్దలు.)

      దీనిని అమ్మవారి వచనంగా తీసుకుంటే హనుమంతుడికి అనుఙ్ఞాపూర్వక ఆశీస్సు ధ్వనిస్తుంది. మనకున్న సత్సంకల్పాలను భగవంతుని పాదార్పణం చేసి మనం పఠించి హనుమను ప్రార్థస్తే, అభ్య్యర్థనాపూర్వక ప్రార్థన ధ్వనిస్తుంది.
       

No comments: